AP: పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో రెండు విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి అవార్డులు గెలుచుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ శాఖ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, వివిధ సేవల్లో మెరుగైన పనితీరు ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ గుర్తింపు పొందింది. రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్-జన్ భాగీదారి విభాగాల్లో ఏపీ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.