ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొత్తపల్లి సర్పంచ్ రాము యాదవ్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లను కలిసి, జిల్లా సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధికి నిధుల మంజూరు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.