మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో 2027 సెన్సస్ జనగణన సర్వేలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను మున్సిపల్ కమిషనర్, సెన్సస్ చార్జ్ ఆఫీసర్ ఈ. వి. రమణ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో నేరుగా మాట్లాడి సర్వే ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రజలు ఖచ్చితమైన సమాచారాన్ని అందించి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు.