మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని తాతిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఏఈ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.