మార్కాపురం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్లో సీఐ ఉప్పుటూరి శ్రీనివాసులు నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ చట్టాల ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందని, అయితే జరిమానాలు, శిక్షలు కూడా పెరిగాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ప్రవర్తించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మాధవరావు, సిబ్బంది పాల్గొన్నారు.