విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో కొత్త విద్యుత్ లైన్ పనుల కారణంగా, ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మస్తాన్ తెలిపారు. ఆకుల వీధి, దేవాలయం వీధి, పోలేరమ్మ గుడి, పశువుల ఆసుపత్రి, పాత ఎంఆర్వో కార్యాలయం పరిసరాల్లో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్