ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులోని సహజానందస్వామిగుడి దగ్గర నుంచి దాదా నాయుడుపాలెం వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా మారింది. పొదిలి - కొండపి ప్రధాన రహదారి, టంగుటూరు జాతీయ రహదారికి అనుసంధానమై ఉన్న ఈ రోడ్డుపై ప్రతినిత్యం అధిక సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. కేవలం రెండు కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులు చేస్తే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు కోరుతున్నారు.