పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన కలెక్టర్

మార్కాపురం కలెక్టర్ విజయ సునీత మంగళవారం మార్కాపురం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి, పెట్రోల్, డీజిల్ నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. అయితే, బల్క్‌గా ఎవరికీ పెట్రోల్, డీజిల్ పోయరాదని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పెట్రోల్ బంకుల నిర్వాహకులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్