మార్కాపురం జిల్లా నూతన ఇన్చార్జి కలెక్టర్గా పి. రాజబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిపాలనపై సమీక్ష నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.