మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో సోమవారం ఎస్ఐ రాజేష్ పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీజిల్, పెట్రోల్ నిల్వలపై ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. నిర్వాహకులకు సూచనలు చేస్తూ, ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.