ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. వాహనంతో పాటు వెనుక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోతే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని పోలీసులు హెచ్చరించారు.