వెలిగండ్ల మండల ప్రజలు సైబర్ మోసాలకు లోనవకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై జి.కృష్ణ పావని గురువారం సూచించారు. సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో వచ్చే అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదని, APK ఫైల్స్ డౌన్లోడ్ చేయరాదని సూచించారు. అపరిచితుల కాల్స్కి మోసపోయి డబ్బులు పంపవద్దని తెలిపారు.