జలుమూరు: సమయ వేళలు తప్పనిసరిగా పాటించండి: ఎంఈఓ మాధవరావు

విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా సమయ వేళలు పాటించాలని ఎంఈఓ బమ్మిడి మాధవరావు తెలిపారు. గురువారం ఉదయం జలుమూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ మోడల్ పాఠశాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమయానికి వచ్చే విధంగా వారి వారి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా పాటించాలని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్