నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 31న జరిగే వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సిఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం లేదా గొడవలు పడడం వంటివి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా వేడుకలు నిర్వహించాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు.