మంగళవారం సాయంత్రం నరసన్నపేట మండల కేంద్రంలో పలు స్క్రాప్ దుకాణాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. చెత్త నుండి సంపదను ప్రైవేటు రంగంలో ఎలా సృష్టిస్తున్నారో దుకాణ యజమానులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలలో నిర్వహిస్తున్న సంపద కేంద్రాలను కూడా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జెసి కూడా పాల్గొన్నారు.