మందస ఎస్సై కె కృష్ణ ప్రసాద్ నూతన సంవత్సర వేడుకలలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని, డీజేలను అనుమతులు లేకుండా ఉపయోగించరాదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సూచనలు శ్రీకాకుళం, పలాస ప్రాంతాలకు వర్తిస్తాయి.