పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ నర్సింగ్ రావు తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆర్డీఎస్ ఆధ్వర్యంలో విద్యుత్ వైర్లు వేస్తున్న పనుల కారణంగా బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.