రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ను సరఫరా చేయడానికి ఏపీ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం వల్ల రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందించనుంది. రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు రానివ్వకుండా సౌర విద్యుత్ను ఏపీ ప్రభుత్వం సమకూరుస్తోంది.