ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం కొత్త పర్యవేక్షకులను నియమించనుంది. ఈ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికోసం, మండల స్థాయిలో 660 మంది డిప్యూటీ ఎంపీడీఓలను నియమిస్తారు. ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. కాగా, సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన ప్రకారం, A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.