AP: తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్, కాలేజీ బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు 108 బస్సులను పరిశీలించగా, భద్రతా ప్రమాణాలు, పత్రాల సక్రమతను తనిఖీ చేశారు. లోపాలున్న వాహనాలకు నోటీసులు జారీ చేసి, ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఈ నెల 15లోపు ATS సెంటర్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి.