బొబ్బిలి మండలంలో రేపు (శుక్రవారం) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొంత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారి బి. రఘు తెలిపారు. మక్కువ, పక్కి ఫీడర్ల పరిధిలో చెట్టు కొమ్మలు తొలగింపు పనుల నేపథ్యంలో ఈ అంతరాయం జరుగుతుందన్నారు. నారసింహునిపేట, మక్కువ, పక్కి సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.