బొబ్బిలి మండలంలోని డొంగురువలస, భూబంధరవలస గ్రామాల్లో పెండింగ్లో ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై తహసీల్దార్ ఎం. శ్రీను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన వినతుల పురోగతిని సమీక్షించి, సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.