పార్వతీపురం జిల్లాలో బెట్టింగులకు పాల్పడినా, ఇతరులను ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని SP మాధవరెడ్డి హెచ్చరించారు. IPL జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగులు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.క్రికెట్ మ్యాచ్లు స్నేహితులతో వినోదం కోసం మాత్రమే చూడాలన్నారు. ఆన్లైన్లో గాని ఆఫ్లైన్లో గాని బెట్టింగులకు పాల్పడినట్లు తెలిస్తే కేసులు నమోదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.