మక్కువ: గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం

మన్యం జిల్లా మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. బుధవారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలంలోని బాగుజోలలో 24 కుటుంబాలు, చిలక మెండంగిలో 48 కుటుంబాలు, బెండమెడంగిలో ఐదు కుటుంబాలు, తాడిపుట్టిలో 10 కుటుంబాలు, దోయ్ వరలో ఐదు కుటుంబాలు, సిరివరలో 130 కుటుంబాలు వెరసి 222 కుటుంబాలకు, కుటుంబానికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ జరిగింది.

సంబంధిత పోస్ట్