పోలీసులు ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఎస్సై పాపారావు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని, దీనిని ధరించకపోతే ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలవుతాయని తెలిపారు. హెల్మెట్ ధరించడం చట్టపరమైన బాధ్యతతో పాటు ప్రాణాలను కాపాడే చర్య అని, అతివేగాన్ని తగ్గించి సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్