పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో, అనారోగ్యంతో మరణించిన సాలూరు రూరల్ ఏఎస్ఐ కీ. శే. రచ్చా ఆదినారాయణ సతీమణి రచ్చా పద్మావతికి ఎస్బీఐ పోలీసు సేలరీ ప్యాకేజ్ కింద మంజూరైన రూ. 10 లక్షల చెక్ను జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి అందజేశారు. విధి నిర్వహణలో మరణిస్తే రూ. 1 కోటి, సాధారణ మరణం అయితే రూ. 10 లక్షలు అందిస్తామని, పోలీసు సిబ్బంది సంక్షేమానికి శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ భరోసా ఇచ్చారు.