విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఇండియన్ బ్యాంక్లో పెన్షన్ దారులకు నగదు పంపిణీని త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో బ్యాంకు మేనేజర్ను కోరారు. మంగళవారం బ్యాంకును సందర్శించిన ఆయన, వృద్ధులు ఇబ్బంది పడకుండా వెంటనే పేమెంట్స్ అందేలా చూడాలని సూచించారు. దీనికి మేనేజర్ సానుకూలంగా స్పందించి, ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.