నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణలో అనారోగ్యంతో మరణించిన హోంగార్డు పంచద వెంకటరమణ కుటుంబానికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అండగా నిలిచారు. శుక్రవారం ఎస్పీ తన కార్యాలయంలో మృతుడి భార్య భవానికి రూ. 4,06,535/- నగదు చెక్కును అందజేశారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని హోంగార్డులు తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్ను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చి ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తోటి సిబ్బందిని అభినందించారు.