అనకాపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన 273 అర్జీలను పూర్తిగా విచారించి, శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా విని, సంబంధిత శాఖలకు పంపి, త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.