భీమిలి నియోజకవర్గంలోని కొమ్మాది విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారాణంగా సంబంధిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2. 30గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ బి. సింహాచలం నాయుడు గురువారం తెలిపారు. కొమ్మాది జంక్షన్, శ్రీనివాసనగర్, సాయిరాంకాలనీ, జీసీసీ లే అవుట్, హౌసింగ్ బోర్డు కాలనీ, అమరావతి కాలనీ విద్యుత్ సరఫరా ఉండదన్నారు.