విశాఖ సీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి లా అండ్ ఆర్డర్, క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్ వంటి పోలీస్ సంబంధిత సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరిస్తామని చెప్పారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.