విశాఖపట్నం సిరిపురం ప్రాంతంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇంధనం కోసం వాహనాలు రోడ్లపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.