విశాఖలోని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్రా మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్లోని ప్లాట్ఫారాలు, వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సేవల నాణ్యత, రైళ్ల సమయపాలనపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) కె. రామారావుతో పాటు పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.