ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి జగదీష్ అడహళ్లి విశాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్-1 గా నియమితులయ్యారు. 2020 యూపీఎస్సీ పరీక్షలో 440వ ర్యాంకు సాధించిన ఆయన, గతంలో అసిస్టెంట్ కమిషనర్గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ పదోన్నతితో విశాఖ నగర డీసీపీ-1గా బాధ్యతలు స్వీకరించనున్నారు.