ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్ తో పాటు అన్ని మండల, మునిసిపల్, డివిజిన్ కార్యాలయాల్లోనూ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అనివార్య కారణాల వల్ల రాకపోతే తమ అర్జీలను ఆన్ లైన్ ద్వారా meekosam. ap. gov. in అనే వెబ్ సైట్ లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు.