చింతూరు ఏఎస్పీగా బొడ్డు హేమంత్ నియామకం

రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బొడ్డు హేమంత్ చింతూరు ఉపవిభాగం కొత్త అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా నియమితులయ్యారు. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న పంకజ్ కుమార్ మీనా అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పదోన్నతితో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోనే హేమంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్