సోమవారం, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరిస్తారు. గ్రీవెన్స్ కార్యక్రమంతో పాటు, ఉదయం 10 గంటలకు రెవెన్యూ క్లినిక్ను కూడా ప్రారంభిస్తారు. జిల్లాలోని అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.