విశాఖ నగర అభివృద్ధి మరియు జీవీఎంసీ పరిపాలన సౌలభ్యం కోసం జోనల్ పునర్వస్తీకరణ చేపట్టినట్లు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్ లతో కలిసి ఆశిల్ మెట్ట వద్ద ఈస్ట్ జోన్ జోనల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.