విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, బుధవారం పెదవాల్తేరు శ్రీ పోలమాంబ దేవాలయం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధర్మకర్తల మండలి ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. ఎండోమెంట్ చట్టాల ప్రకారం పారదర్శకంగా వ్యవహరిస్తూ, అవినీతికి తావులేకుండా భక్తుల సేవలో ముందుండాలని ఆయన నూతన ధర్మకర్తలకు పిలుపునిచ్చారు.