గృహ యజమానులు, ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి అర్థ సంవత్సర ఆస్తిపన్నును ఈ నెల 30లోగా చెల్లించాలని నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. గడువులోగా పన్ను చెల్లించి వడ్డీ భారాన్ని నివారించుకోవాలని సూచించారు. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, తాగునీటి ఛార్జీలను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.