ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఒకసారి వచ్చిన అర్జీని నాణ్యతతో పరిష్కరించడం ద్వారా అదే అర్జీదారుడు మళ్లీ మళ్లీ అదే సమస్యపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా చూడటమే ప్రత్యేక పీజీఆర్ఎస్ ముఖ్య ఉద్దేశ్యమని ఆమె పేర్కొన్నారు.