జిల్లా జాయింట్ కలెక్టర్ శుక్రవారం రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రీసర్వే పురోగతి, పాస్బుక్కుల జారీపై సమీక్షించారు. జిల్లాలో 263 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, వాటిలో 193 గ్రామాల రికార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగిలిన 70 గ్రామాల రికార్డులను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని, నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని ఆదేశించారు.