పెదపాడు: టీచర్ గా మారిన జిల్లా కలెక్టర్

శనివారం, పెదపాడు మండలం ఏపూరు గ్రామంలోని బధిరుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మమేకమై, వారితో ముచ్చటించారు. పాఠశాలలో వారికి అందిస్తున్న విద్యా బోధన, సౌకర్యాలను ఆమె పరిశీలించారు. పాఠశాల సిబ్బందిని అడిగి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, విద్యార్థులకు దుప్పట్లు, నోటు పుస్తకాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్