ఏలూరులో బుధవారం, ప్రమాదవశాత్తూ మరణించిన హోంగార్డు వీరబాబు కుటుంబానికి ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ రూ. 41.40 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 11.40 లక్షలు, యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 30 లక్షల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.