ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యాలయం పునఃనిర్మాణంలో భాగంగా నూతన గ్రంథాలయం నిర్మించేందుకు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీని గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిషత్ పంచాయతీ వనరుల భవనాన్ని జిల్లా గ్రంథాలయ కార్యాలయానికి కేటాయించాలని ఆయన కోరారు. ఈ సమావేశం ఏలూరులో జరిగింది.