జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య శాఖాధికారి శోభారాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని స్టాక్ రిజిస్టర్లు, ఓపీ రికార్డులను పరిశీలించి, వైద్యులకు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి గ్రామంలో పర్యటించి, జ్వర బాధితులను గుర్తించి తక్షణమే హాస్పిటల్కు సమాచారం అందించాలని ఆదేశించారు.