తాడేపల్లిగూడెం జీవీ మాల్ సెంటర్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నిర్మూలనకు పోలీసుల అవగాహన కార్యక్రమం జరిగింది. పట్టణ సీఐ ఆది ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు, డీఎస్పీ విశ్వనాథ్ సూచనలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆపరేషన్ చిన్నారి తల్లి, ఆపరేషన్ దండయాన్ వంటి కార్యక్రమాల గురించి మహిళలు, చిన్నారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.