ప.గో. జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్