మహారాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ దాతేను రాష్ట్ర నూతన డీజీపీగా నియమించింది. ప్రస్తుత డీజీపీ రష్మీ శుక్లా జనవరి 3న పదవీ విరమణ చేయనుండగా, అదే రోజు దాతే బాధ్యతలు స్వీకరించనున్నారు. 1990 బ్యాచ్కు చెందిన దాతే ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. 26/11 ముంబయి దాడుల్లో వీరోచిత పోరాటం చేసినందుకు రాష్ట్రపతి పతకం అందుకున్న ఆయన, రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.