లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ను పోలీసులు గురువారం కరీంనగర్ కోర్టుకు తరలించారు. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ ఫిర్యాదు చేయడంతో కొత్తపల్లి పీఎస్లో మే 5న అఘోరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో కూడా అఘోరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు అఘోరీని కోర్టుకు తరలించారు. కాగా, అఘోరీపై ఇప్పటివరకు మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి.